Thursday, April 25, 2024
- Advertisement -

‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రారంభమయ్యేదెప్పుడంటే..!

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటనతో సినిమాల్లో ఆకట్టుకోవడమే కాకుండా, తన వాగ్ధాటితో టీవీ ప్రేక్షకులను కూడా సమ్మోహన పరిచిన సంగతి తెలిసిందే. మా టీవీలో ప్రసారమైన బిగ్ బాస్ మొదటి సీజన్లో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. బిగ్ బాస్ షోని సక్సెస్ ఫుల్ గా నిర్వహించాడు. అప్పుడే ఎన్టీఆర్ సినిమాల్లోనే కాదు టీవీ షోలలో కూడా అదరగొట్టగలడని నిరూపించుకున్నాడు.

బిగ్ బాస్ సెకండ్ సీజన్ కు నాని, థర్డ్, ఫోర్త్ సీజన్లకు నాగార్జున హోస్ట్ గా చేసినప్పటికీ మొదటిసారి హోస్ట్ గా చేసిన ఎన్టీఆర్ కే బాగా పేరొచ్చింది. కాగా కొన్ని నెలల కిందట జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు అనే గేమ్ షో గ్రాండ్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అనౌన్స్ మెంట్ చేసి నెలలు గడుస్తున్నా షో ప్రారంభం కాలేదు. కరోనా కారణంగానే ఈ షో వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఎవరు మీలో కోటీశ్వరులు షో ఎప్పుడు ప్రారంభమయ్యేది ప్రస్తుతం క్లారిటీ వచ్చింది. ఈ టీవీ షో షూటింగ్ జూలై రెండవ వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ షో కోసం ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో ఓ సెట్ వేశారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్స్ ని కూడా షార్ట్ లిస్ట్ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టాకీ పార్ట్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. కొన్ని పాటల షూటింగ్ జరగాల్సి ఉంది. ఇందులో తన వర్క్ పూర్తవగానే ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం షూటింగ్ కి హాజరవుతారని సమాచారం.

Also Read: అగ్ర హీరోలూ ఈ సారైనా వెండితెరపై దర్శనమిస్తారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -