Sunday, May 19, 2024
- Advertisement -

సాహోలో మ‌రో బాలీవుడ్ హీరోయిన్‌

- Advertisement -

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి త‌రువాత నేష‌న‌ల్ లేవ‌ల్లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది.ఈ సినిమా త‌రువాత అత‌ని మార్కెట్ విలువ కూడ పెరిగింది.దీంతో ప్ర‌భాస్ త‌రువాత సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.అదేవిధాంగా అత‌ని సినిమాల‌కు డిమాండ్ కూడా పెరిగింది.’సాహో’ హింది రైట్స్‌కు మంచి రేటు వ‌చ్చింద‌ని స‌మాచారం.హింది మార్కెట్‌కు అనుగుణంగా హింది న‌టుల‌ను ఎక్కువుగా తీసుకున్నారు ఈ సినిమాలో.ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. సినిమాలో ప్రధాన పాత్రల్లో ఎక్కువ మంది బాలీవుడ్‌ నటులే ఉన్నారు. ప్రతినాయకుడిగా నీల్‌నితిన్‌ ముఖేశ్ నటిస్తుండగా జాకీ ష్రాఫ్, మందిరా బేడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పుడు సినిమాలో మరో బాలీవుడ్‌ భామ‌ ఎవ్లిన్‌ శర్మ వచ్చారు. ‘యారియా’, ‘కుచ్‌ కుచ్‌ లోచా హై’, ‘యే జవానీ హై దివానీ’ చిత్రాల్లో ఎవ్లిన్‌ నటించారు. సాహోలో తన పాత్ర కోసం ఎవ్లిన్‌ పది కిలోలు తగ్గారట. యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు ‘ర‌న్ రాజా ర‌న్ ఫేమ్’ సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.తెలుగులో ఇంత‌వ‌ర‌కు రాని యాక్షన్‌ అడ్వెంచరస్‌గా ఈ చిత్రం రానుంద‌ని స‌మాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -