అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఈ రోజు(శుక్రవారం) విడుదలైంది. ఈ సినిమా మొదటి షో పడక ముందే సినిమాను ఎవరో ఫేస్బుక్లో లైవ్ పెట్టారు. దీంతో బన్నీ అభిమానులు అందోళన చెందుతున్నారు.సినిమా రీలిజ్ రోజునే ఇలా సినిమాను ఫేస్బుక్లో పెట్టడంతో చాలా మంది ఆశ్చర్యపొతున్నారు. సినిమాలో బన్నీ ఆర్మీ ఆఫీసర్గా కనిపిస్తున్నా సంగతి తెలిసిందే.రచయిత వక్కంతం వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచియమవుతున్నాడు.
మరి సినిమాను ఇలా రీలిజ్ రోజునే ఫేస్బుక్ లైవ్ పెట్టడంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి.అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ సినిమా ప్రీ రీలిజ్ ఈవెంట్ రోజున బన్నీ సినిమాపై కుట్ర జరుగుతుందని చెప్పుకొచ్చారు. మరి కుట్ర ఇదేనేమో చూడాలి.సినిమాను ఫేస్బుక్లో 24 నిమిషాల 56 సెకన్ల పాటు లైవ్ ఇచ్చారు. ఇండస్ట్రీ దీనిపై ఎటువంటి చర్యలకు దిగుతారో చూడాలి.
Also Read: ‘నా పేరు సూర్య’ మూవీ రివ్యూ