Sunday, April 28, 2024
- Advertisement -

పూరీ జగన్నాథ్ కొడుకు పేరుతో ఫేక్ ఖాత.. పోలీసులకు ఫిర్యాదు..!

- Advertisement -

ఇప్పుడు ఎవరైన సోషల్ మీడియా అకౌంట్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. అభిమానులతో మాట్లాడానికి.. విమర్శకులు ఏమంటున్నారో తెలుసుకోవడానికి సెలబ్రిటీలకు ఉన్న ఏకైక ప్లాట్ ఫాం ఈ సోషల్ మీడియా. అయితే ఈ సోషల్ మీడియా ఎంత పాపులారిటీ తెచ్చిపెడుతుందో.. అంతకంటే ఎక్కువ సమస్యలు కూడా తెచ్చిపెడుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై ఫేక్ అకౌంట్స్ ఎక్కువైపోయాయి.

ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తే చేశారు. కానీ ఫలానా సెలబ్రిటీ పేరును వాడుకుని తప్పుడు పనులు చేస్తేనే అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. అసలు ఇదంత ఎందుకంటే.. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ గురించి. ఎవరో తెలియని వ్యక్తి ఆకాశ్ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. అంతటితో ఆగాడా.. ఎందరో అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెట్టాడు. దాంతో కొందరు అమ్మాయిలు నిజంగానే ఆకాశ్ పూరీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు అనుకుని చాటింగ్స్ చేయడం స్టార్ట్ చేశారు.

అయితే ఓ అమ్మాయి మాత్రం తనతో చాట్ చేస్తోంది ఆకాశ్ కాదని ఎలాగోలా తెలుసుకుంది. ఇలా సెలబ్రిటీల పేరుతో ఫేక్ అకౌంట్స్ తెరిచి మోసం చేసేవారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో వెంటనే రియాక్ట్ అయిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన నిందితుడి నుంచి హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్స్ స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఈ వివాదం గురించి పూరీ జగన్నాథ్ కానీ ఆకాశ్ కానీ స్పందించలేదు. ఇక ఆకాష్ విషయంకు వస్తే.. అతను మెహబూబా సినిమా ప్లాప్ తర్వాత రొమాంటిక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. దాంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -