Monday, May 20, 2024
- Advertisement -

ప‌వ‌న్‌కు విగ్ర‌హం పెట్టేసిన ఫ్యాన్స్‌

- Advertisement -

జ‌న‌సేన అధ్య‌క్షుడు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై త‌మ అభిమానాన్ని చాటుకున్నారు పశ్చిమగోదావరి జిల్లా వాసులు.హీరోలు, రాజ‌కీయ నాయ‌కుల మీద అభిమానులు త‌మ‌కు న‌చ్చిన రీతిలో అభిమానాన్ని వ్య‌క్త‌ప‌రుస్తారు. ఫ్లెక్సీలకు, కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం వంటివి జరుగడం మామూలే. దీనికి భిన్నంగా పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు త‌న అభిమానాన్ని చాటుకున్నాడు.ప‌వ‌న్ విగ్ర‌హం ఏర్పాటు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు.ఏడున్నర అడుగుల నిలువెత్తు విగ్రహం ఏర్పాటుతో పవన్ పై అభిమానాన్ని చాటుకున్నాడు ఆ వ్యక్తి. గబ్బర్ సింగ్‌‌గా పవన్‌కు అచ్చొచ్చిన రెడ్ టవల్‌ను నడుముకు చుట్టించి, మెడలో జనసేన కండువాతో ఈ విగ్రహాన్ని రూపొందించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -