Monday, May 20, 2024
- Advertisement -

నందమూరి హీరోకి, ఆ దర్శకుడి పడటం లేదా!

- Advertisement -

సురేందర్ రెడ్డి.. కల్యాణ్ రామ్ కెరీర్ కి తొలి హిట్ ను ఇచ్చిన దర్శకుడు. అలాగే ఆ సినిమా సురేందర్ రెడ్డికి కూడా చాలా ప్లస్ అయ్యింది.

వీళ్లిద్దరి కాంబినేషన్ లో దాదాపు పదేళ్ల క్రితం ‘అతనొక్కడే’ సినిమా వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరూ గాడినపడ్డారు. ఆతర్వాత సురేందర్ రెడ్డి చాలా హిట్ సినిమాలు చేశాడు. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరో రకంగా రిపీటవుతున్న విషయం తెలిసిందే.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘కిక్-2’ సినిమాను నిర్మించాడు కల్యాణ్ రామ్. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇప్పుడు విశేషం ఏమిటంటే.. ఈ దర్శకుడికి, నిర్మాత అయిన కల్యాణ్ రామ్ కు ఇగో ప్రాబ్లమ్స్ వచ్చాయని తెలుస్తోంది. వీళ్లద్దరికీ ఒకరంటే ఒకరికి పడటం లేదని…  ఇప్పుడు ఈ సినిమా ప్రచారానికి సురేందర్ రెడ్డి దూరం జరుగుతున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఇటీవల జరిగిన సెన్సార్ కార్యక్రమానికి కూడా సురేందర్ మొహం చాటేశాడు. సాధారణంగా సినిమా సెన్సార్ అవుతున్నప్పుడు దర్శకుడు అక్కడే ఉంటాడు. అయితే సురేందర్ రెడ్డి మాత్రం ‘కిక్-2’ సెన్సార్ వైపు రాలేదు. దీంతో నిర్మాత, దర్శకుల మధ్య క్లాషెష్ అన్న వాదనకు బలం చేకూరుతోంది. మరి ఆగస్టు 21 న ఈ సినిమా విడుదల కానుంది… అప్పుడు వీరిద్దరి మధ్య ప్రాబ్ల్సమ్ పై మరింత క్లారిటీ వస్తుంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -