మెగాస్టార్ చిరంజీవి, సురేందర్ రెడ్డి చేస్తున్న ‘సైరా’ చిత్రం షూటింగ్ చివరిదశకు చేరింది.ఈ మద్య కేరళాలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించి వచ్చారు చిత్ర యూనిట్. బ్రిటీష్ వారిని ఎదిరించిన మొట్ట మొదటి తెలుగు బిడ్డ పోరాట యోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
అయితే అనుకోకుండా చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా సినిమా సెట్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోకాపేటలోని అరవింద్ సొంత ఫాం-హౌజ్లో వేసిన సైరా సెట్ అగ్రికి పూర్తిగా దగ్ధమైంది. దీంతో సుమారు ₹ 2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. సైరా సెట్లో అగ్నిప్రమాదం సంభవించిన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించింది.
కొన్ని రోజులు గా ఇక్కడే సినిమాకు సంబంధించిన కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. గురువారం రాత్రి వరకూ చిత్ర బృందం షూటింగ్ జరిపింది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థలో రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చిరు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నారు