Friday, May 3, 2024
- Advertisement -

వరుణ్ సందేశ్ వాళ్ళ ఏడ్చిన వితిక… కారణం భూపాళం

- Advertisement -

ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో జరుగుతున్న డ్రామా రోజు రోజుకీ ఆసక్తికరం గా సాగుతుంది. ఇప్పటికే ఒక వీక్ కూడా కంప్లీట్ అయింది. మొదటి వారం చివరికి హేమ ఇంట్లో నుంచి ఎలిమినేటి అయింది కానీ తమన్నా మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీ రూపం లో షో లో కి వచ్చింది. ఆమె రావడం రావడం తోనే వరుణ్ సందేశ్ వితిక షేరు లకి మహేష్ విట్టా కి మధ్య గొడవలు పెట్టే విధం గా ప్రవర్తించింది.

అయితే ఎవరి ప్రమేయం లేకుండా నే వరుణ్ సందేశ్ కి వితిక షేరు కి మధ్య గొడవ జరిగింది. మంగళవారం నాడు జరిగిన ఎపిసోడ్ లో పునర్నవి భూపాళం, వితిక షేరు ల మధ్య ఒక చిన్న వాగ్వాదం జరిగింది. టాస్క్ లో కూడా పాల్గొనమని నవి వితిక కి చెప్పగా వితిక ఎందుకు పాల్గొనలేకపోతుందో వివరణ ఇవ్వసాగింది.

ఈ మధ్యలో దూరి వరుణ్ సందేశ్ వితిక ని కాదని పునర్నవి కి వత్తాసు పలికాడు. ఈ సంఘటన జీర్ణించుకోలేని వితిక వెంటనే బోరు బోరు న ఏడ్చింది. తర్వాత ఇతరులు వెళ్ళి ఓదార్చారు. చివరికి భార్యాభర్తలు ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు క్షమాపణలు చెప్పుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -