ఈ సంవత్సరం తెలుగు ఇండస్ట్రీకి బాగానే కలిసి వచ్చినట్లుంది.ఈ సంవత్సరం పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా తమ సత్తా చాటాయి. భరత్ అనే నేను, రంగస్థలం, మహానటి వంటి చిత్రాలు భారీ వసూళ్లను రాబట్టాయి. ఎలాంటి హడావుడి లేకుండా రిలీజైన చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. ఇటీవల విడుదలైన గూఢచారి, ఆర్ఎక్స్ 100, చిలసౌ, గీతగోవిందం చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి.ఇక ఈ శుక్రవారం మరో నాలుగు చిన్న సినిమాలు థియోటర్లలో సందడి చేయనున్నాయి.
నీవెవరో, ఆటగాళ్లు, అంతకుమించి, లక్ష్మీ చిత్రాలు రేపు విడుదల కాబోతున్నాయి.’ఆటగాళ్లు’ చిత్రంలో నారా రోహిత్, జగపతిబాబులు ప్రధాన పాత్రలను పోషించారు. ‘నీవెవరో’ సినిమాలో ఆది పినిశెట్టి, తాప్సీ, రితికాసింగ్ లు జంటగా నటిస్తున్నారు.ప్రభుదేవా నటించిన ‘లక్ష్మీ’ చిత్రంపై కూడా ఆసక్తి నెలకొంది. ‘అంతకుమించి’ చిత్రంలో రష్మి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మరి ఈ నాలుగు సినిమాలలో ఏ చిత్రం విజయం సాధించిన తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి జరిగినట్లే.