Sunday, May 5, 2024
- Advertisement -

ఆడ‌వాళ్లు సిగ‌రెట్లు తాగితే త‌ప్పేంటి క‌మ‌ల్ సార్‌

- Advertisement -

క‌మ‌ల్ హాస‌న్ ‘మక్కళ్‌ నీది మయ్యం’ పార్టీని స్థాపించిన సంగ‌తి తెలిసిందే.అయితే ఇటు బిగ్‌బాస్ రియాల్టీ షో బిగ్‌బాస్‌కుహోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు కమలహాసన్,బిగ్ బాస్ హౌస్ లోని లేడీ సెలబ్రిటీలు సిగరెట్లు కాలుస్తుండటం, పురుషులతో కలసి ఒకే మంచంపై నిద్రించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి వాటిని కమల్ ఖండించిన సంగ‌తి తెలిసిందే.అయితే క‌మ‌ల్ చేసిన వాఖ్య‌ల‌పై త‌మిళ న‌టి గాయత్రి స్పందించారు.

ఆడవారు సిగరెట్లు తాగడమేంటని, మగవారు చేసే పనులను మహిళలు చేయరాదని, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని ఈ సందర్భంగా కమల్, మహిళా కంటెస్టెంట్ లకు క్లాస్ పీకారు. దీనిపై తన సోషల్ మీడియా ఖాతాల్లో స్పందించిన గాయత్రి, మగవారి కంటే గొప్పవాళ్లమని చెప్పుకునేందుకు ఆడవాళ్లు సిగరెట్లు కాల్చడం లేదని చెప్పింది. ఆడవాళ్లకు కూడా మానసిక ఒత్తిడి, మనోవేదన ఉంటాయని, ఆ కారణంగానే సిగరెట్లు కాలుస్తున్నారని అంది. గత సంవత్సరం బిగ్ బాస్ లో గాయత్రి కంటెస్టెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే.

https://twitter.com/gayathriraguram/status/1016744142825635840

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -