- Advertisement -
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ఈ మధ్య కాలంలో వెనకబడ్డారు.సరైన హిట్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు.‘లౌక్యం’ సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ మళ్లీ గోపీచంద్ అందుకోలేదు. కిందటేడాది వచ్చిన ‘ఆక్సిజన్’, ‘గౌతమ్నంద’ సినిమాలు కూడా తీవ్రంగా నిరాశపరిచాయి. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టలనే కసితో పంతం సినిమాతో వస్తున్నాడు.
పంతం మూవీ గోపిచంద్ కెరీర్లో 25వ సినిమా కావడంతో సినిమాపై మరింత ఫోకస్తో పని చేస్తున్నారు చిత్ర యూనిట్.ఈ సినిమాలో గోపిచంద్ సరసన మెహరీన్ హీరోయిన్గా నటిస్తుంది. చక్రి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. , ‘పంతం’ టీజర్కు చిత్ర యూనిట్ ముహూర్తం ఖరారు చేసింది. ఈనెల 5న ఉదయం 11 గంటలకు టీజర్ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని జూలై 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.