బాలీవుడు డైరెక్టర్ ఓం రైత్ రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆది పురుష్. ఈ సినమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీనిపై ఇప్పటికే అంచనాలు ఎంతగానో పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందా అని సినీ ప్రేమికులు వేచి చూస్తున్నారు.
ఒక వైపు ఈ సినిమా రూ.400 కోట్ల బడ్జెట్తో తీయనున్నారని ప్రచారం జరుగుతోంది. అంత ఖర్చు చేసి ఏ రేంజ్ లో తీసున్నారో అనే పలు ప్రశ్నలు సినీ ప్రేమికుల్లో మొదలయ్యాయి. ఇప్పటికి ఈ సినిమాలో నటించే తారలను వెతికే పనిలో ఆ చిత్రయూనిట్ ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యే స్టార్ట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటి యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ నటి యాక్ట్ చేసేది సాధాసీధా క్యారెక్టర్ కు కాదు. రాముడి తల్లిగా యాక్ట్ చేయాలి. ఏవరెవరా.. ఈ పాత్రలో నటించేది అనే చర్చకు సమాధానం దొరికింది అనిపిస్తుంది. ఈ పాత్రలో ఒకప్పటి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ అయినా హేమమాలిని నటించనుందని సమాచారం. ఇదే నిజం అయితే ఈ సినిమాకు ఆమె కూడా ఒక ప్లేస్ అవుతుందని పలువురు చెబుతున్నారు.
భారీ ఆఫర్ ను కొట్టేసిన యాంకర్ రష్మీ ?
మరోసారి గోపిచంద్ తో రాశిఖన్నా రోమాన్స్ !
చలికాలంలో రోజూ స్నానం చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే !