బహుబలి సినిమా తరువాత బయట ప్రపంచానికి పెద్దగా కనిపించలేదు హీరో ప్రభాస్. ఈ సినిమా తరువాత రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాను మొదలు పెట్టాడు.ఈ సినిమాకు సంబందించిన చిన్న విషయం కూడా బయటకు రానివ్వకుండ మెయిన్టెయిన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. 70% దుబాయ్లో షూటింగ్ జరుపుకుంటున్న, ఈ సినిమా ఫైట్ సీన్స్ హాలీవుడ్ రేంజ్లో ఉంటాయని సమాచారం.ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ ఫోటో ఒకటి బయటికి వచ్చింది.ఈ పిక్లో ప్రభాస్ రేస్ బైక్ మీద కుర్చోని ఉన్నాడు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బహుబలి తరువాత ప్రభాస్ క్రేజ్ ఇండియా మొత్తం వ్యాపించింది. దీనిని దృష్టిలో ఉంచుకునే హింది మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ని తీసుకున్నారు. హీరోయిన్తో పాటు నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, చుంకీ పాండేలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మరి సినిమా ఈ సంవత్సరం అయిన రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.