Saturday, April 27, 2024
- Advertisement -

వామ్మో.. వైష్ణవ్ తేజ్ అప్పుడే రేటు పెంచాడే!

- Advertisement -

మెగాస్టార్ చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తొలి సినిమా”ఉప్పెన”.కృతి శెట్టి హీరోయిన్ గా ఈ సినిమాలో నటించింది…సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది..’మైత్రి మూవీ మేకర్స్’ మరియు ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ లు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలయ్యింది. ఈ చిత్రంలోని…’నీ కన్ను నీలి సముద్రం’ అనే పాట మొదటి నుండీ సినిమా పై అంచనాలు పెరిగేలా చేసింది. ఇక టీజర్, ట్రైలర్ లు కూడా ప్రామిసింగ్ గా ఉండడంతో అంచనాలు మరింత పెరిగాయి.

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏ హీరో మొదటి సారే ఈ స్థాయి రికార్డు క్రియేట్ చేయం ఇదే ఫస్ట్ అంటున్నారు అభిమానులు. సాధారణంగా హీరోల డెబ్యూ సినిమాలకు రెమ్యునరేషన్ పెద్దగా ఇవ్వరు. కానీ వైష్ణవ్ తేజ్ విషయంలో అలా జరగలేదు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరో కావడంతో నిర్మాతలు అతడికి రూ.50 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారట. తొలి సినిమాకే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్న వైష్ణవ్.. ఇప్పుడు తన క్రేజ్ ని బాగా ఉపయోగించుకుంటున్నాడు. తన రెండో సినిమాను కూడా పూర్తి చేశాడు ఈ హీరో.

క్రిష్ దర్శకత్వంలో రకుల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రూ.75 లక్షలు రెమ్యునరేషన్ గా అందుకున్నాడట వైష్ణవ్ తేజ్.అయితే ఇది ‘ఉప్పెన’ రిలీజ్ కు ముందే అనుకున్న డీల్.. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.. వైష్ణవ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. భోగవల్లి ప్రసాద్ తెరకెక్కించనున్న సినిమాకి గాను వైష్ణవ్ రూ.2.5 కోట్లు తీసుకుంటున్నాడట. మూడో సినిమాకే ఇంత మొత్తంలో పారితోషికం అందుకోవడం విశేషంగా చెప్పుకోవాలి..మెగా ఫ్యామిలీలో ఏ హీరో కూడా కెరీర్ ఆరంభంలోనే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోలేదనే చెప్పాలి.

పుష్ప కోసం బన్నీ ఏం చేస్తున్నాడో తెలుసా..?

హీరో నితిన్ ‘చెక్’ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?

కేసిఆర్ కి హై కోర్టు షాక్… కారణం అదేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -