- Advertisement -
సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథను ఆయన తనయుడు హీరో బాలకృష్ణ సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసింది. ఈసినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా రెగ్యులర్ ఫూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.సినిమాలో భారీ తారగణాన్ని తీసుకుంటున్నాడు దర్శకుడు క్రిష్.విద్యాబాలన్,రానా, ప్రకాశ్ రాజ్ ,మోహన్ బాబు,సీనియర్ నరేశ్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు.తాజాగా సినిమాలోని కీలక పాత్ర కోసం హీరోయిన్ కీర్తిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.
ఎన్టీఆర్ నట ప్రస్థానంలో సావిత్రి పాత్రను టచ్ చేయకుండా ఉండటం కష్టం. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ‘మహానటి’ లో సావిత్రిగా నటించిన కీర్తి సురేశ్ను మరోసారి ఆ పాత్రకే ఎంపిక చేసినట్లు సమాచారం.ఇక ఈ సినిమాలో రకుల్ కూడా ఓ ప్రత్యేక సాంగ్లో నటించనుందని తెలుస్తుంది.