హీరోయిన్ పూజా హెగ్డె కోపం వచ్చింది.బ్రిటీష్ ఎయిర్ వేస్ సిబ్బంది భారతీయులను తక్కువగా చూస్తున్నారని ఇటీవలే బాలీవుడ్ హీరో రిషి కపూర్ బ్రిటీష్ ఎయిర్ వేస్ లో ప్రయాణించకండి అంటూ ఓ పోస్ట్ పెట్టారు. తాజాగా పూజా హెగ్డే కూడా తన స్నేహితుడు ఎదుర్కొన్న విషయాన్ని వెల్లడిస్తూ బ్రిటీష్ ఎయిర్ వేస్ పట్ల తన అసహనాన్ని వ్యక్తం చేసింది.’నిన్న రాత్రి బ్రిటీష్ ఎయిర్ వేస్ సిబ్బంది తన పట్ల జాతీ వివక్షను ప్రదర్శించిన విషయం నా స్నేహితుడు చెప్పాడు.
అతడు కేవలం ఒక గ్లాస్ మంచి నీళ్లు అడిగితే వారు ఇవ్వకుండా రెండు గంటల పాటు వెయిట్ చేయించారు. కానీ పక్కనే ఉన్న మరో విదేశీయుడికి గ్యాప్ లేకుండా మద్యం సప్లై చేశారు. బ్రిటీష్ ఎయిర్ వేస్ సిబ్బంది చాలా అసహ్యకరంగా ప్రవర్తించారు’ అంటూ పూజా వెల్లడించింది. బ్రిటీష్ ఎయిర్ వేస్ ఇలా చేయడం చాలా దారుణం అని,నా ఫ్రెండ్ పట్ల వారు ప్రవర్తించిన తీరుతో వారు తీవ్ర విమర్శల పాలైందని ఆమె వాఖ్యనించింది.