న్యూ ఇయర్ తర్వాత షూటింగ్
మన డార్లింగ్ సినిమా బాహుబలితో అందర్నీ ఆకట్టుకున్న ప్రభాస్ సాహోతో వచ్చే ఏడాది కాకుండా మళ్లొచ్చే ఏడాది అంటే 2019లో వస్తాడంట. ఈ వార్త అభిమానులకు బ్యాడ్ న్యూసే. కానీ ఈ సినిమా గురించి రోజుకో ముచ్చట బయటకు వస్తుండడంతో అభిమానులు, ప్రేక్షకులకు ప్రభాస్ సినిమా రావడం లేదనే బాధ ఉండడం లేదు. ఆ విధంగా చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు ఈ సినిమా కోసం మరో కబురు వచ్చింది.
బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్తో తీస్తున్న సినిమా సాహో. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తీశారు. మరికొన్ని రోజుల్లో చిత్ర బృందం కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను దుబాయ్లో తీయనున్నారట.
న్యూ ఇయర్ తర్వాత సాహో కోసం ప్రభాస్ కొట్లాడనున్నాడట. అది అతి ఎత్తైన బుర్జ్ ఖలీఫాపైనంట. ఈ సీన్లను హలీవుడ్ కొరియోగ్రాఫర్లు తీయనున్నారు. దీనికోసం ఇప్పటికే లోలోపల పనులు పూర్తవుతున్నాయి.
ప్రభాస్ యాక్షన్ సీన్స్కు హలీవుడ్ వాళ్లు పనిచేస్తున్నారట. ప్రముఖ హాలీవుడ్ మూవీస్ డై హార్డ్ – ట్రాన్స్ఫార్మర్స్ వంటి సినిమాలకు పనిచేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఫైట్ సీన్లను తీస్తారట. 20 నిమిషాల యాక్షన్ సీన్లను దుబాయ్లోని అతి ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాలో తీస్తారని టాక్. పెద్ద పెద్ద ట్రక్స్ కార్స్తో ఛేజింగ్ ఫైట్ ఉండనుందని సమాచారం. సినిమాకు ఆ సీన్స్ హైలెట్గా నిలవాలని చిత్రబృందం ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
ఈ సినిమాకు సుజీత్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా దాదాపు రూ.150 కోట్లతో తీస్తున్నారు. హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటిస్తోంది.