రజనీ ప్రధానయితే భారత్ నం-1
తీసే సినిమాలు విభిన్నం.. తాను అనుకున్న మాటలు నిక్కచ్చిగా ఎలాంటి భయం, జంకు లేకుండా మాట్లాడే వ్యక్తి దర్శకుడు రామ్గోపాల్ వర్మ. అతడే చేసే ప్రతి పని వివాదాస్పదమవుతాయి. తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తారు. వీటిపై అందరూ ఆసక్తికరంగా గమనిస్తారు. ఇప్పుడు మరో ఆసక్తికర ట్వీట్లు చేశారు. రజనీకాంత్ ప్రధానమంత్రి అయితే భారత్.. అమెరికా స్థాయికి చేరుకుంటుందంటూ ట్విటర్లో పేర్కొన్నరు.
‘‘ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో భారత్ కూడా ఒక దేశం. అదే రజనీకాంత్ ప్రధానమంత్రి అయితే భారత్ కచ్చితంగా అమెరికా స్థాయికి చేరుతుంది. 2.జీరో నుంచి 200.జీరోకు చేరుతుంది’’ అని ఆసక్తికర ట్వీట్ చేశారు. దీనితోనే కాదు వివాహం, మరణం ఒకటేనంటూ మరో ట్వీట్ చేశారు. ‘‘వివాహం, అంత్యక్రియలు నాకు ఇష్టం ఉండదు. ఒకటి స్వేచ్ఛను కోల్పోయేందుకు చేస్తే.. మరొకటి దేహం చనిపోయినందుకు చేస్తారు’’ అంటూ ట్వీటర్లో పేర్కొన్నారు.
https://twitter.com/RGVzoomin/status/960555346862510080