Thursday, May 2, 2024
- Advertisement -

‘డియర్ కామ్రేడ్’ సినిమా చూడబోతున్న మహిళా క్రికెటర్

- Advertisement -

విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించలేకపోయింది. ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమా ఓపెనింగ్ డే రోజు 11.5 కోట్లను కలెక్షన్లు నమోదు చేసుకుంది. త్వరలో 20 కోట్ల క్లబ్ లో చేరబోతున్న ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లాలంటే కనీసం ముప్పై నాలుగు కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా సెకండ్ హాఫ్ లో నేషనల్ టీం క్రికెటర్ అవుదామనుకున్నా రష్మిక మందన్న చీఫ్ సెలెక్టర్ నుంచి లైంగిక వేధింపులను ఎదుర్కొంటుంది.

ఆ పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది అని సినిమా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాని ఒక మహిళా క్రికెటర్ చూడబోతున్నారు. ఆమే ఇండియన్ మహిళా క్రికెట్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమ్మింగ్ మరియు మిథాలీ రాజ్ కలిసి ‘డియర్ కామ్రేడ్’ సినిమా కొంత మంది పిల్లలతో పాటు చూడబోతున్నారు. లైంగిక వేధింపుల గురించి పిల్లలు కూడా తెలుసుకోవాలని అలాంటి పరిస్థితుల్లో ఎలా తప్పించుకోవాలి, ఎలా ఫిర్యాదు చేయాలని వారికి తెలియాలని ఈ సినిమా చూపిస్తున్నట్టు సమాచారం. మరి మిథాలీ రాజ్ ఈ సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడితే నైనా కలెక్షన్లు పెరుగుతాయా లేదా చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -