బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ప్రతీష్టాత్మక చిత్రం ట్రిపుల్ ఆర్ సినిమా. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలున్నాయి. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ అంచనాలేఉన్నాయి.ఈ మల్టీస్టారర్ మూవీని 300 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మొదటి షెడ్యూల్ పూర్తి చేసకొని రెండో షెడ్యూల్కు సిద్దమవుతోంది చిత్రం యూనిట్.
ఇక రాజమౌలి సినిమాలో విలన్కు ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుందో అందరికీ తెలసిందే. అయితే ఆర్.ఆర్.ఆర్ లో ఇద్దరికి హీరోలకు ధీటైన విలన్ ను చూస్తున్నాడట జక్కన్న. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ గా కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తాడని అంటున్నారు. కన్నడలో వరుస హిట్లు కొడుతున్న యశ్ తెలుగులో కె.జి.ఎఫ్ సినిమాతో వచ్చాడు. డబ్బింగ్ వర్షన్ అయినా తెలుగులో కె.జి.ఎఫ్ బాగానే వసూళ్లు రాబడుతుంది.
ఒకవేళ ఆర్.ఆర్.ఆర్ లో యశ్ నటించడం కన్ ఫాం అయితే అతని కెరియర్ కు మంచి బూస్టప్ దొరికినట్టే. ఇప్పటికే రాజమౌళి ఈగలో సుదీప్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. యశ్ కూడా ట్రిపుల్ ఆర్ లో నటిస్తే మరింత పాపులారిటీ తెచ్చుకునే అవకాశం ఉంది. యశ్ విలన్గా ఉంటాడా లేదా అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది.