Saturday, April 20, 2024
- Advertisement -

ఏం సిద్ధూ టాలీవుడ్‌లో క‌నిపించ‌వా.. త‌మిళ్‌, మ‌ళ‌యాలంలో బిజీ

- Advertisement -
మొద‌ట తెలుగు హీరోగా రాణించిన సిద్ధార్థ ఇప్పుడు టాలీవుడ్‌కు దూర‌మ‌య్యాడు. ప్ర‌స్తుతం త‌మిళ్‌, మ‌ళ‌యాలంపై దృష్టి పెట్టాడు. ఇటీవ‌ల  ‘గృహంస సినిమాతో తెలుగులో వ‌చ్చినా అది త‌మిళ సినిమా డ‌బ్బింగ్ మాత్ర‌మే. స్ర్టెయిట్‌గా ఒక్క తెలుగు సినిమా ప్ర‌స్తుతం సిద్ధార్థ చేయ‌డం లేదు. అత‌డు చివ‌ర‌గా ఫుల్ లెంగ్త్ సినిమా అంటే ఓ మై ఫ్రెండ్‌, ల‌వ్ ఫెయిల్యూర్ సినిమాలే. అవి వ‌చ్చి దాదాపు ఐదారేళ్ల‌వుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు సిద్ధూ ఒక్క సినిమా తెలుగులో చేయ‌లేదు. ప్ర‌స్తుతం సిద్ధూ కోలీవుడ్‌, మాలీవుడ్‌లోనే ఉంటున్నాడు.
ప్ర‌స్తుతం సిద్ధూ తమిళ్‌తో పాటు మ‌ళ‌యాలంలో తెర‌కెక్కిస్తున్న సినిమా ‘కమ్మార సంభవం’. ఈ సినిమా టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌ల‌య్యింది. తాను హీరోగా కాకుండా ఓ ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు. దిలీప్ హీరోగా న‌టిస్తున్న ‘కమ్మార సంభవం’ సినిమాలో సిద్దార్థ్‌ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. రతీశ్‌ అంబత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ విడుద‌ల చేశా బ్రిటిష్‌ కాలంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా పీరియడ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆనాటి పరిస్థితులు ప్రతిబింబించేలా సినిమాను తీర్చిదిద్దారు. ఇందులో తన పాత్రకు సిద్దార్థ్‌ స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకున్నాడు.
వేసవి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ గోకులం మూవీస్ బ్యాన‌ర్‌పై గోకులం గోపాలన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో కూడా డ‌బ్బింగ్ చేసి విడుద‌ల చేయ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -