Saturday, May 11, 2024
- Advertisement -

కొత్త లుక్‌లో జాహ్న‌వీ క‌పూర్ ఫోటోలు..

- Advertisement -

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కెరీర్ నెమ్మదిగా వేగం పుంజుకుంటోంది. దఢక్ చిత్రంతో జాన్వీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో జాన్వీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్ర‌స్తుతం కరణ్ జోహార్ దర్శక నిర్మాణంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ చిత్రంలో న‌టిస్తుంది జాన్వీ. తక్త్ అనే టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఆయ‌న స‌ర‌స‌న క‌రీణాక‌పూర్ న‌టిస్తున్నారు.

జాన్వీ కపూర్ తదుపరి చిత్రానికి సంబందించి లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1999 కార్గిల్ యుద్ధంలో అత్యంత సాహసోపేతంగా గాయపడ్డ సైనికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ గుంజన్ సక్సేనా బయోపిక్ తెరకెక్కించేందుకు రంగం సిద్ధం అవుతోంది.ఈ బయోపిక్ లో సక్సేనా పాత్రలో జాన్వీ కపూర్ న‌టిస్తోంది.

జాన్వి, గుంజన్‌ కలిసి దిగిన ఫొటో కూడా అప్ప‌ట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తాజాగా పైల‌ట్ లుక్‌లో జాన్వీ ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ ఫోటోని చూసి అభిమానులు మురిసి పోతున్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్ ఈ చిత్రంలో హీరోగా క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించే ముందుగా జాన్వీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి కొన్ని ప్రాధమిక విషయాల్లో శిక్షన పొందుతున్నట్లు తెలుస్తోంది.

మ‌హిళా పైల‌ట్ గుంజ‌న్ 1999 కార్గిల్‌ యుద్ధంలో గాయాలపాలైన సైనికులను తన విమానంలో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించి అందరిచే ప్ర‌శంస‌లు పొందింది. ఆమె ధైర్యానికి మెచ్చిన ప్ర‌భుత్వం శౌర్య‌వీర్ అవార్డ్ కూడా అందించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -