Thursday, April 18, 2024
- Advertisement -

బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న మన జాతి రత్నాలు సినిమా ఇదే!

- Advertisement -

టాలీవుడ్ యువ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా కె.వి అనుదీప్ దర్శకత్వంలో కామెడీ బ్యాక్ గ్రౌండ్ లో రూపొందించిన చిత్రం “జాతిరత్నాలు”.ఈ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇందులో హీరో స్నేహితులుగా ప్రధాన పాత్రల్లో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు తెలుగు ఆడియన్స్ చేత నవ్వుల పువ్వులు పూయించారు. నవీన్ కు జోడిగా కొత్త బ్యూటీ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ప్రేక్షకుల మనస్సు దోచుకుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తక్కువ బడ్జెట్‌తో రూపొంది భారీ బడ్జెట్ మూవీలకు దీటుగా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది.

ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందింది.ఇదిలా ఉండగా జాతి రత్నాలు మూవీనీ హిందీలో రీమేక్ చేయాలనే ప్రయత్నాలు మొదలు పెట్టాడట దర్శకుడు కె.వి అనుదీప్. బాలీవుడ్ లో కూడా నవీన్ కు మంచిగానే గుర్తింపు ఉండడంతో అతన్ని హీరోగా పెట్టి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.ఇప్పటికే ‘చిచోరే’ సినిమాతో బాలీవుడ్లో మెప్పించాడు.

నవీన్ పోలి శెట్టి కొన్ని సక్సెస్ యూట్యూబ్ వీడియోల ద్వారా కూడా మంచి గుర్తింపు సాధించాడు.మరీ ఈ సినిమాలో హీరో స్నేహితులుగా ఎవరిని తీసుకుంటారనే విషయంపై స్పష్టత లేదు.బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టిన జాతిరత్నాలు మూవీ సీక్వెల్ కూడా అనుదీప్ ప్లాన్ చేస్తున్నాడన్న సమాచారం గట్టిగా వినబడుతోంది.

కొరటాలను టార్గెట్ చేసిన ఆ బడా నిర్మాత.. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -