Sunday, May 5, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌ ‘అర‌వింద స‌మేత’ ట్వీట్ట‌ర్ రివ్యూ

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ,మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా అర‌వింద స‌మేత‌.పూజా హెగ్డె,ఈషా రెబ్బాలు హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాను చిన‌బాబు నిర్మించారు.చాలా రోజుల త‌రువాత తెలుగు తెర మీద మ‌ళ్లీ ఫ్యాక్ష‌న్ క‌థ‌తో వస్తున్నాడు ఎన్టీఆర్‌. అజ్ఞాత‌వాసి వంటి ప్లాప్ త‌రువాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగాయి.ఇక ఈ సినిమా ఈరోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. వరుస హిట్ల మీద మంచి జోష్‌లో ఉన్న తార‌క్‌కు ఈ సినిమా ఎలాంటి ఫ‌లితం ఇస్తుందో చూడాలి.

దుబాయ్ లో ఉంటూ టాలీవుడ్ సినిమాలకు మొదటి రివ్యూ ఇచ్చే సినీ విమర్శకుడు ఉమైర్ సంధు ఈ సినిమాకు రివ్యూఇచ్చాడు.మంగళవారం యూఏఈ సెన్సార్ సభ్యులతో కలిసి సినిమా చూసిన ఆయన అనంతరం రివ్యూని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ నటన ఈ సినిమాను నిలబెట్టిందని, ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో అతడు చెప్పే డైలాగులు బాగున్నాయని కొనియాడారు. ఈ సినిమాకు తన రేటింగ్ నాలుగు స్టార్లు అని ఇచ్చారు. గ‌తంలో కూడా ఉమైర్ సంధు తెలుగు సినిమాల‌కు రివ్యూ చెప్పాడు.గతంలో ఫ్లాప్ అయిన ‘స్పైడర్’,’నా పేరు సూర్య’సినిమాలకు కూడా ఆయన నాలుగు రేటింగ్ ఇచ్చారు. మ‌రి ఇప్పుడు ఇచ్చిన నాలుగు రేటింగ్‌తో సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సొంతం చేసుకుంటుందో మ‌రి కొన్ని గంట‌ల్లో తెలిపోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -