భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మక అవార్డ్స్లో ఒకటి సైమా అవార్డ్స్. సౌత్ ఇండియాకు చెందిన నటీనటులు హాజరయ్యే ఈ వేడుక దుబాయ్ వేదికగా జరుగుగతోంది. రెండు రోజుల పాటు ఈ వేడుకలు జరగనుండగా హీరోయిన్స్ తమ అందచందాలతో మెప్పించారు. తొలిరోజు తెలుగు, కన్నడ పరిశ్రమకు చెందిన హీరోయిన్స్ అంతా ఒకే వేదికపై సందడి చేశారు.
ఇక ఈ వేడుకల్లో తెలుగులో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటనకు గాను ఉత్తమ యాక్టర్గా ఎంపికయ్యారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం కొరటాల శివతో దేవర సినిమా చేస్తున్నారు జూనియర్.
ఇక ఈ వేడుకల్లో తన ఫ్యాన్స్ ప్రస్తావన తీసుకొచ్చి అందరి దృష్టి ఆకర్షించారు ఎన్టీఆర్. తాను కష్టాల్లో ఉన్నపుడు, కింద పడినప్పుడు,సక్సెస్ సాధించిన ప్రతీ దాంట్లో తన అభిమానులు ఉన్నారని చెప్పుకొచ్చారు. నేను ఏడిస్తే ఏడ్చారు…నవ్వితే నవ్వారు…అలాంటి అభిమానులు ఉన్నందుకు గర్వంగా ఉందని…వారందరికి పాదాభివందనాలు చేస్తున్నానను అని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.