ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘జై లవ కుశ’ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బాబీ దర్శకత్వం వహస్తున్నఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు.
జై, లవ, కుశ మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. గురువారం సాయంత్రం 5.22 గంటలకు జై పాత్రకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. టీజర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇప్పటివరకు కేవలం హీరోగా నటించిన ఎన్టీఆర్.. ఏదో ఒక్క ఊసరవెల్లి సినిమాలో తప్పిస్తే.. అసలు పెద్దగా నెగెటివ్ షేడ్ ఉన్న క్యారక్టరే ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు తొలిసారిగా మనోడు పూర్తి స్థాయి విలన్ వేషాలు వేశాడు. ”ఆ రావణుడ్ని సంపాలంటే సముద్రం దాటాలా.. ఈ రావణుడ్ని సంపాలంటే.. సముద్రమంత ధ ధ ధ ధ ధైర్యం ఉండాలా” అంటూ ఒకేసారి మనోడి కలిగించే భయాన్ని.. అలాగే తనకున్న నత్తిని పరిచయం చేశాడు దర్శకుడు.
{loadmodule mod_custom,GA1}
సినిమాలో ‘జై’ పాత్ర చాలా భయంకరంగా ఉంటుందని…. అత్యంత కర్కశమైన విలనిజంతో కూడుకుని ఉంటుందని తెలుస్తోంది.ఈ టీజర్లో ఎన్టీఆర్ హావభావాలు అదిరిపోయే విధంగా…. నటనలో రౌద్రం ప్రదర్శిస్తూ ఎన్టీఆర్ నిజంగానే ప్రేక్షకులను భయపెట్టాడు. టీజర్ ఇలా ఉందంటే సినిమాలో ఇంకా ఏం రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈసినిమాలో నివేథా థామస్, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}_wcs7ixyDbY{/youtube}