ప్రస్తుతం ఎక్కడ విన్న మొదటగా వినిపించేది కబాలి..కబాలి..కబాలి. ఏ చిత్రానికి రానంత క్రేజ్ ఈ సినిమాకి వచ్చింది. బిజినెస్ పరంగానే కూడా ఈ చిత్రం భారీ స్థాయిలో జరిగింది. అలాగే ప్రమోషన్స్ పరంగా కూడా కబాలి అంచనాలు రెట్టింపు చేసింది. ఇక ఈ చిత్రం మరో వారం రోజుల్లో విడుదల కానుంది. అభిమానులు అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అని ఎదురుచూస్తున్నారు.
అయితే అందరికంటే ముందే ఈ చిత్రాన్ని ఓ వ్యక్తి చూసారు అని చెప్తున్నారు చిత్ర యూనిట్. ఆమె ఎవరో కాదు రజని కూతురు సౌందర్య. ఇటివలే సౌందర్య ఈ చిత్రాన్ని చూసిందట. సినిమా ఓ రెంజ్ లో ఉందని, నాన్నగారి నటన చాలా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చిందట. దీంతో అభిమానులు కోరుకున్నట్లే కబాలి ఉంటుందని అంటున్నారు.
దీంతో సినిమా ఎంత కలెక్షన్స్ సాధిస్తుందనే అంచనాలు వేయడం మొదలు పెట్టారు అభిమానులు. మరో పక్క చిత్ర నిర్మాత 500 కోట్లు కొల్లగొట్టడం ఖాయం అంటూ స్టేట్మెంట్స్ ఇవ్వడం సినిమా పై మరింత క్రేజ్ ఏర్పడుతుంది.
Related