కబాలి సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని రజినీకాంత్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి రంజిత్ దర్శకత్వం వహిస్తుండగా రజినీ సరసన రాధిక ఆప్టే హీరోయిన్ గా నటిస్తోంది. రిలీజ్ కు మరికొన్ని రోజులు ఉండగా ఈ చిత్ర యూనిట్ కబాలి ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రత్యేక పద్దతిలో కబాలి సినిమాకు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్ర యూనిట్.
ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆడియెన్స్ను ఏ మాత్రం నిరాశపరచకూడదని అదిరిపోయే రెంజ్ లో పబ్లిసిటీ టెక్నిక్స్తో రికార్డు క్రియేట్ చేయడం ఒక్క రజినీకాంత్ వల్లనే అవుతోంది అంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ వెర్షన్కే 30 కోట్లకు పైగా రాబట్టింది. ప్రమోషన్స్ విషయంలో రాజీ పడటం లేదు. ఇప్పటికే బస్సులు, రైళ్లు లపై కబాలి పోస్టర్లు దర్శనిస్తున్నాయి.
ఇప్పుడు ఏకంగా ఫ్లైట్లకు కబాలి పోస్టర్స్తో ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్లైట్ల పై భాగంలో కబాలి పోస్టర్స్ తో డిజైనింగ్ చేశారు. ఇలాంటి ప్రమోషన్స్ కేవలం హాలీవుడ్ సినిమాలకే చేస్తుంటారు. ఇప్పుడు రజినీకాంత్ సినిమా వల్ల ఇక్కడ కూడా ఇలాంటి ప్రమోషన్స్ చేస్తున్నారు. మరి ఇంతగా ప్రమోషన్స్తో దుమ్ములేపుతున్న కబాలి సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి.
Related