Saturday, April 20, 2024
- Advertisement -

దృశ్యం సీక్వెల్ లో కమల్ కి జోడిగా నదియా..?

- Advertisement -

మలయాళం సూపర్ హిట్ సినిమా దృశ్యం తెలుగులో వెంకటేష్ -మీనా జంటగా నటించారు. అదే సినిమా తమిళంలో  ‘పాపనాశమ్‌’ గా తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది. ఈ రీమేక్ లో కమల్ హాసన్ -గౌతమి జంటగా నటించారు. అయితే ప్రస్తుతం దృశ్యం సినిమాకి సీక్వెల్ గా దృశ్యం 2 తెలుగులో తెరకెక్కుతోంది. ఇందులో వెంకటేష్ – మీనా ప్రధాన పాత్రలో పోషించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులలో ఉంది.

ఇప్పుడు ఈ సినిమాను తమిళంలో సీక్వెల్ గా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించనున్నారు. ఈ క్రమంలోనే గౌతమి కమల్ హాసన్ నుంచి విడిపోయిన నేపథ్యంలో ఆమె స్థానంలో మరొక హీరోయిన్ ను ఎంపిక చేసుకోవాలని చిత్రబృందం భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కమల్ హాసన్ సరసన నటించడం కోసం హీరోయిన్ నదియాను ఎంపిక చేసినట్లు సమాచారం వినబడుతోంది.

నదియా తెలుగులో తెరకెక్కిన దృశ్యం సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. అదే విధంగా దృశ్యం 2 లో మాజీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ క్రమంలోనే ఈమెను తమిళ చిత్రంలో కమల్ హాసన్ సరసన తీసుకుంటే ఓకే కథలో రెండు వేరు వేరు పాత్రలను నదియా పోషించినట్లు అవుతుంది. అయితే తమిళంలో తెరకెక్కుతున్న దృశ్యం సీక్వెల్ చిత్రానికి కమల్ సరసన నదియాను తీసుకుంటారా.. లేక మరెవరికైనా అవకాశం ఇస్తారా అనే విషయం గురించి చిత్రబృందం అధికారికంగా వెల్లడించాల్సి ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -