కంగనా రనౌత్.. బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్. సినిమాల నుంచి పాలిటిక్స్ దాకా దేనిపైన అయినా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడేస్తుంది. అలా ఆమె చేసిన కామెంట్స్ చాలా సందర్భాల్లో దేశవ్యాప్తంగా పెను దుమారమే రేపాయి. ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ గా హెడ్ లైన్స్ లో ఉంటూ వస్తోంది.
తాజాగా కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకొచ్చింది. అయితే ఈ సారి మరో వివాదంతో కాదులెండి. కంగనా మోస్ట్ డేరింగ్ షోకి హోస్ట్ గా వ్యవహరించబోతోందన్న న్యూస్ సినీ వర్గాల్లో చక్కర్లుకొడుతోంది. టీవీ క్వీన్ ఏక్తా కపూర్.. ఆల్ట్ బాలాజీ, MX ప్లేయర్ కోసం రూపొందించే క్రేజీ, డేరింగ్ రియాలిటీ షో కోసం కంగనాను ఎంచుకుంది. కంగనా ఈ షోను హోస్ట్ చేయబోతోంది. బిగ్ బాస్ మాదిరిగా ఉండటం ఈ షో స్పెషాలిటీ.
అది మాత్రమే కాదు అంతకు మించి అంటున్నారు షో నిర్వాహకులు. కంటెంట్ మరింత డేరింగ్ గా ఉంటుందట. ప్రముఖ సెలబ్రిటీలు పార్టిసిపెంట్స్గా పాల్గొనే ఈ షోను హోస్ట్ చేయడానికి కంగనాకు భారీగానే చెల్లించారని సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రాబోతోంది. మరి కంగనా బుల్లితెరపై ఎలా రఫాడిస్తుందో చూడాలి మరి.
తెరపై రీఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్ మాజీ భార్య