Tuesday, May 28, 2024
- Advertisement -

శ్రీదేవి మ‌ర‌ణం.. హీరోయిన్‌కు జ్వ‌ర‌మొచ్చింది

- Advertisement -

షూటింగ్‌కు ప్యాక‌ప్ చెప్పేసి మంచంపైకి

శ్రీదేవి మ‌ర‌ణం భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌ను విషాదంలోకి నెట్టింది. ఆమె మ‌ర‌ణించ‌డం.. ఒక ఎత్త‌యితే ఆమె మృత‌దేహం ఇంత వ‌ర‌కు భార‌త్‌కు తిరిగి రాక‌పోవ‌డంతో ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. అయితే శ్రీదేవి మ‌ర‌ణించిన విష‌యం తెలుసుకున్న ఓ హీరోయిన్ తెగ ఏడ్చేసింది. ఈ దెబ్బ‌కు జ్వ‌రం తెచ్చుకొని మంచాన ప‌డింది. దీంతో ఆ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ప‌డిన ఘ‌ట‌న బాలీవుడ్‌లో చోటుచేసుకుంది.

గౌతమీపుత్ర శాతకర్ణి ఫేం క్రిష్ దర్శకత్వంలో ‘మణికర్ణిక’లో కంగనా రనౌత్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ షూటింగ్‌లో ఉన్న స‌మ‌యంలో కంగనాకు శ్రీదేవి మ‌ర‌ణించార‌నే వార్త వ‌చ్చింది. ఈ వార్త వినగానే కంగాన కంగారు ప‌డిపోయింది. వెంట‌నే కన్నీరుమున్నీరై ఏడ్చేసింది. ఏడుస్తూ షూటింగ్‌కు పేకప్ చెప్పి ఇంటికి వెళ్లిపోయిందట. అయితే షూటింగ్ నుంచి వెళ్లిపోవ‌డంతో రేపు వ‌స్తుంద‌ని భావించిన సినిమా బృందానికి ఆ త‌ర్వాత రోజు షాక్‌కు గుర‌య్యే వార్త వ‌చ్చింది.

తనకు తీవ్ర జ్వరం ఉండ‌డంతో షూటింగ్‌కు రాలేను అని కంగనా ర‌నౌత్ సినిమా బృందానికి మెసేజ్ పంపింది. శ్రీదేవి మ‌ర‌ణంతో కంగనా దిగ్ర్భాంతికి గుర‌య్యి జ్వ‌రం తెచ్చుకునేంత స్థాయికి ఏడ్చేసింది. దీంతో ఆమె కోలుకోవ‌డానికి రెండు, మూడు రోజులు ప‌ట్టే అవ‌కాశం ఉంది. ప్లాన్ చేసుకున్న షెడ్యూల్‌ని వాయిదా వేసింది. కంగ‌నా శ్రీదేవిని ఎంత అభిమానించిందో ఈ విష‌యం బ‌ట్టి అర్థం చేసుకోవచ్చు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -