బాలీవుడ్ లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నటి కంగనా రౌనత్. సిని ఇండస్ట్రీపైనే కాదు.. సామాజిక విషయాలపై కూడా తనదైన స్టైల్లో స్పందిస్తుంటారు కంగనా రౌనత్. ఈ అమ్మడు ఎంత కాంట్రవర్సీ అయినా.. ఇండస్ట్రీలో మాత్రం అద్భుతమైన నటన కనబరుస్తూ ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది. ఆ మద్య మణికర్ణిక చిత్రం ఎంత గొప్ప హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్ ‘తలైవి’లో ఆమె నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా తమిళ వర్షన్ కు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు మరో సెన్సేషనల్ పాత్రలో కనిపించబోతుంది కంగన. మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ పాత్రను పోషించబోతున్నట్టు ఆమె తెలిపింది. కాకపోతే ఈ చిత్రం బయోపిక్ కాదని.. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన పరిణామాల ఆధారంగా సినిమా తెరకెక్కుతుందని కంగన వెల్లడించింది. కంగనా సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మిస్తుండగా, సాయి కబీర్ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు.
గ్రాండ్ పిరియాడిక్ ఫిల్మ్ గా, పొలిటికల్ డ్రామాతో నేటి తరం వారికి ప్రస్తుతం భారతదేశ రాజకీయ పరిస్థితులు అర్థం అయ్యేలా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు కంగనా వెల్లడించారు. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు నటిస్తున్నారు.
కొత్తగూడెంలో ఘోరం.. తనని తిట్టాడని మర్మాంగాన్ని కోసేశాడు.. చావుబతుకుల్లో బాధితుడు!