ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన నటి రాధ. తెలుగు స్టార్ హీరోల సరసన నటించిన రాధ అందం.. అభినయం మాత్రమే కాదు.. అద్భుతమైన డ్యాన్స్ తో అదరగొట్టింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోల తనయులు హీరోలుగా వస్తున్న సమయంలో నటి రాధ కూతురు కార్తీక నాయర్ ‘జోష్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతోనే అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య కూడా హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. తర్వాత తమిళంలో ‘కో’( తెలుగులో రంగం) సినిమాతో అక్కడి ప్రేక్షకులను పలకరించింది.
ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అవ్వడంతో యూత్లో కార్తీకకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆతరువాత మలయాళ, కన్నడ ఇండస్ట్రీలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.. కానీ అక్కడ పెద్దగా కలిసి రాలేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దమ్ము’, అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’చిత్రాల్లో కీలకపాత్ర నటించింది.
కానీ తెలుగు లో కూడా కార్తీక కు పెద్దగా కలిసి రాలేదు. 2016లో విడుదలైన ‘వా డీల్’ తర్వాత తెరపై కనిపించలేదు. అయితే తాజాగా కార్తీక సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. కార్తీక సినిమాల్లో అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టినట్టు టాలీవుడ్ టాక్.
మరియమ్మ లాకప్డెత్పై సీఎం కేసీఆర్ సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు