సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మరోసారి నటుడు ,జనసేన అధినేత పవన్ కల్యాణ్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు.కాకపోతే ఈ సారి కాస్తా డిఫరెంట్గా కామెంట్ చేశాడు. తెలుగుదేశం పార్టీ గురించి చెబుతూ జనసేన పార్టీ గెలుపుపై ఊహించని విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జనసేన 3 నుంచి ఏడూ సీట్లు మాత్రమే గెలుస్తుందని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “కాంగ్రెస్ వ్యతిరేకత.రాజకీయ శూన్యత. కమ్మ కుల అధికార దాహం. ఎన్. టి.రామారావు చరిష్మా. ఇవన్నీ కలిపి తెలుగుదేశం పార్టీపెట్టిన ఎనిమిది నెలల కాలంలో అధికారంలోకి వచ్చింది.
చిరంజీవి ప్రభావం జనసేన మీద ఖచ్చితంగా ఉంటుందని కత్తి అభిప్రాయపడ్డారు.పవన్ కళ్యాణ్ తెలివి శూన్యత..కొణిదెల బ్రదర్స్/ఫ్యామిలీ పై అపనమ్మకం. కాపు కుల అనైక్యత. రాజకీయలపై అనుభవం లేమి కలగలిపి పవన్ రాజకీయాలలోకి వచ్చి ఐదు సంవత్సరాలు అయినా, జనసేన 3 నుంచి 7 సీట్లకు మించి గెలవదు” అంటూ కత్తి మహేష్ పేర్కొన్నాడు. కత్తి మహేశ్ చేసిన ట్విట్పై ఎప్పటిలాగే పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.