Friday, May 10, 2024
- Advertisement -

సీబీఐ మాజీ జేడీపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన క‌త్తి

- Advertisement -

మాజీ సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. సొంత పార్టీ పెడుతున్నారాలేకా వేరే పార్టీలో చేరుతున్నారా అనేది స‌స్పెన్స్‌గా మారింది. మొద‌ట ఆయన కొత్త పార్టీ స్థాపించి వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు నిన్న మొన్నటి దాకా వెలువడ్డాయి . కాని సీన్ రివ‌ర్స్ అయ్యింది.

లక్ష్మీనారాయణను లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ పార్టీలోకి ఆహ్వానించడంతో కథ మరో మలుపు తిరిగింది. పార్టీలోకి రావడమే కాకుండా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని లక్ష్మీనారాయణను జయప్రకాశ్ కోరారు. అయితే దీనిపై ఆలోచిస్తున్నానని, త్వరలోనే తన నిర్ణయం వెల్లడిస్తానని లక్ష్మీనారాయణ చెప్పారు. అయితే దీనిపై వివాదాల క‌త్తి …క‌త్తిలాంటి వివాదాస్పాద వ్యాఖ్య‌లు చేశారు.

లోక్‌సత్తా నియంత, తన పార్టీని ఇప్పటిదాకా పార్టీలో కష్టపడినవాళ్ళకి కాక.. పైనుంచి ఊడిపడిన జేడీకి సగర్వంగా ధారాదత్తం చేసినటువంటి కమనీయ దృశ్యాన్ని చూసి తరించి హర్షించిన జనులందరికీ నా హర్షాతిరేకాలు తెలియజేస్తూ, సంభ్రమాశ్చర్యాలకి గురవుతున్నాను’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పలు పోస్టులు చేశారు. ఇదే ఇప్పుడు హాట్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -