Saturday, May 4, 2024
- Advertisement -

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి వార్నింగ్ ఇస్తున్న కౌశల్

- Advertisement -

బోలెడు వివాదాల మధ్య బిగ్ బాస్ మూడవ సీజన్ ఈ మధ్యనే విజయవంతంగా మొదలైన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ సీజన్ 2లో కౌశల్ మండ విజేతగా నిలిచాడు. సీజన్ 2 మొదలైన కొన్ని వారాలకే కౌషల్ ఆర్మీ పేరుతో అతనికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ లభించింది. అయితే బిగ్ బాస్ సీజన్ 2 ముగిసిపోయిన కొన్నాళ్ల తర్వాత సైలెంట్ అయిపోయిన కౌశల్ ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ ల కు వార్నింగ్ ఇస్తూ వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా ఇంస్టాగ్రామ్ కౌశల్ షేర్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

“దయచేసి నా పేరుని కానీ, కౌశల్ ఆర్మీ పేరుని కానీ బిగ్ బాస్ త్రీ కోసం లేదా పబ్లిసిటీ కోసం వాడద్దు. ఇది నా వార్నింగ్” అని పేర్కొన్నాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 3 మొదలవకముందే శ్రీముఖి ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో కొన్ని పేజీలు పుట్టుకొచ్చాయి. గత సీజన్లో కౌశల్ ఆర్మీ దగ్గరుండి కౌశల్ ని విజేతగా నిలిచేలా చేసింది. ఈ నేపథ్యంలో మిగతా హౌస్ మేట్స్ ఇందులో ఏదో మతలబు జరిగిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి సీజన్ 3 లో కూడా శ్రీముఖి ఆర్మీ శ్రీముఖి ని గెలిపిస్తుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -