- Advertisement -
జయ జయ నాయకి సినిమాతో విజయం అందుకున్న యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన తర్వాతి సినిమా శ్రీవాస్ దర్శకత్వంలో `సాక్ష్యం` చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజుగారి గది సినిమాల దర్శకుడు ఓంకార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన కీర్తి సురేశ్ను ఎంపిక చేశారంట. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేశ్ ఈ ప్రాజెక్టును చేజిక్కుంచుకున్నారు. మరో అజ్ఞాతవాసి సినిమాలో కనిపించింది.
బుల్లతెర నుంచి సినిమా దర్శకుడిగా ఓంకార్ మారాడు. రాజుగారి గది సినిమాలతో పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఓ క్రీడా సంబంధిత ఇతివృత్తంతో సినిమా తీయనున్నారు. ఈ డిఫరెంట్ జానర్లో వచ్చే సినిమాలు విజయాలు అందుకుంటుండడంతో ఓంకార్ ఈ కథను ఎంచుకున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి.