- Advertisement -
కీర్తి సురేష్ చిత్ర యూనిట్ ఉన్న సభ్యులు అందరికి బంగారు నాణేలును పంచి పెట్టారు.ఎక్కడ అనుకుంటున్నారా! విషయం ఏమిటంటే ….అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది.నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
సావిత్రికి తన సినిమాకు పని చేసిన వారికి బహుమతులు ఇవ్వటం అలవాటు.ఆ అలవాటు సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ కొనసాగించింది. మహానటి సినిమాకు పనిచేసిన యూనిట్ సభ్యులకు బంగారు నాణేలను గిఫ్ట్ గా ఇచ్చింది. కీర్తి ఇచ్చిన స్వీట్ సర్ప్రైజ్తో యూనిట్ సభ్యులు ఆనందాశ్చర్యాలకు గురయ్యారు.