యువ దర్శకులు కొత్తగా ఆలోచించడంతో విభిన్న కథలు తెరకెక్కుతున్నాయి.విభిన్న కథలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ప్రయత్నిస్తునే ఉంటారు.తాజాగా కేజిఎఫ్ అనే కన్నడ సినిమాను తెలుగులో డబ్ చేస్తున్నారు.యష్ .. శ్రీనిధి శెట్టి నాయకా నాయికలుగా నటించిన ఈ కన్నడ సినిమాలో, రమ్యకృష్ణ .. నాజర్ కీలకమైన పాత్రలను పోషించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ముంబైతో ముడిపడిన గోల్డ్ మైన్స్ మాఫియా నేపథ్యంలో సాగే కథ ఇది. ఆసక్తికరమైన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. “నీ వెన్నంటి వేలమంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని మాత్రమే గెలుస్తావు. అదే నువ్వు ముందున్నావని నీ వెనకున్న వేలమందికి ధైర్యం వచ్చిందంటే ఈ ప్రపంచాన్నే గెలుస్తావు”అనే డైలాగ్ బాగుంది. ట్రైలర్ ను ఆసక్తికరంగా కట్ చేయడంలో నిర్మాత విజయం సాధించాడు.ఇక సినిమాను డిసెంబర్ 21వ తేదీన తెలుగులో విడుదల చేయనున్నారు.