Friday, April 19, 2024
- Advertisement -

కియారా అద్వానీకి ట్రిపుల్ ధమాకా..?

- Advertisement -

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల కథానాయికను ఇండస్ట్రీకి పరిచయం చేసే ముందు వారితో తన నిర్మాణ సంస్థలోనే రెండు మూడు సినిమాలు చేయాలని ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ క్రమంలోనే తమిళ దర్శకుడు శంకర్ కూడా నటి కియారా అద్వానీతో ఏకంగా మూడు సినిమాలకు డీల్ కుదుర్చుకున్నారనే సమాచారం వినబడుతోంది.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో మెగా హీరో రామ్ చరణ్ తేజ్ హీరోగా పాన్ ఇండియా దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు అనే విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ తీసుకున్నారు. అదే విధంగా బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ హీరోగా అపరిచితుడు రీమేక్ సినిమాలో హీరోయిన్ గా ఈ బ్యూటీని ఎంచుకున్నారు.

Also read:యాంకర్ రవిపై అషు రెడ్డి డబుల్ మీనింగ్ డైలాగులు?

ఈ విధంగా రెండు సినిమాలు ఇప్పటికే ప్రకటించగా మరి మూడో సినిమా ఏంటనే విషయం తెలియాల్సి ఉంది. మొత్తానికి కియారా శంకర్ దర్శకత్వంలో త్రిబుల్ ధమాకా ఆఫర్ దక్కించుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం రామ్ చరణ్ ఆచార్య, ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే చరణ్ శంకర్ సినిమాలో పాల్గొననున్నారు.

Also read:రష్మిక కోసం ఏకంగా 900 కి.మీ ప్రయాణించిన అభిమాని… తర్వాత ఏమైందంటే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -