Saturday, April 20, 2024
- Advertisement -

రష్మిక కోసం ఏకంగా 900 కి.మీ ప్రయాణించిన అభిమాని… తర్వాత ఏమైందంటే..!

- Advertisement -

ప్రస్తుత యువ హీరోయిన్లలో రష్మిక మందన్న క్రేజే వేరు. అతి కొద్ది సినిమాలకే ఆమె టాప్ హీరోయిన్ గా మారింది. తెలుగులో ఆమె ప్రస్తుతం నెంబర్ వన్ రేసులో ఉంది. కన్నడ, తమిళ, హిందీ సినిమాల్లోనూ నటిస్తోంది. కాగా రష్మిక మందన్న కోసం అభిమాని చేసిన పని ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.తెలంగాణకు చెందిన ఓ యువకుడు రష్మిక మందన్న సొంత రాష్ట్రమైన కర్ణాటకలో ఆమెను నివసించే ప్రాంతానికి వెళ్ళాడు. చివరికి అతని తీరు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు అతడిని తిప్పి పంపారు. అసలు ఏం జరిగిందంటే..

తెలంగాణకు చెందిన ఆకాష్ త్రిపాఠి రష్మికకు వీరాభిమాని. రష్మికను ఒక్కసారైనా చూడాలని అతడికి ఆశ. దీంతో ఆమెను చూసేందుకు వెళ్లడం కోసం గూగుల్లో ఆమె ఇంటి అడ్రస్ కోసం సెర్చ్ చేశాడు. ఆమె స్వస్థలం కర్ణాటకలోని కొడగు జిల్లా అని తెలుసుకొని అక్కడికి బయలుదేరాడు. సుమారు తొమ్మిది వందల కిలోమీటర్లు ప్రయాణించి అక్కడికి చేరుకున్నాడు.

మొదట మైసూర్ దాకా రైల్లో వెళ్లిన ఆకాశ్, అక్కడినుంచి సరుకు రవాణా చేసే ఆటో ద్వారా కొడుగు ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ కనిపించిన వారందర్నీ రష్మిక ఇల్లు ఎక్కడ అంటూ ఆరా తీశాడు. కొందరికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆకాశ్ ని విచారించారు. రష్మిక ప్రస్తుతం ఇక్కడ లేదని షూటింగ్ కోసం ముంబై లో ఉన్నారని చెప్పి అతడి ని వెనక్కి పంపారు.

Also Read

కేజీఎఫ్ రూట్ లోనే సలార్ కూడా…!

రాకీభాయ్​తో మిల్కీబ్యూటీ రొమాన్స్​.. !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -