Saturday, May 18, 2024
- Advertisement -

శింబుపై వేలాడుతున్న క‌త్తి

- Advertisement -

త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో శింబు వ్య‌వ‌హారం ఆస‌క్తి చోటుచేసుకుంది. తాను న‌టించిన సినిమాకు డేట్లు స‌క్ర‌మంగా ఇవ్వ‌కుండా.. సినిమా ప‌రాజ‌యానికి హీరోనే కార‌ణ‌మ‌ని… చిత్రీక‌ర‌ణ‌లో తీవ్రంగా ఇబ్బంది పెట్టాడ‌ని… ఓ నిర్మాత న్యాయ పోరాటం చేస్తున్నాడు. ఆ హీరోపై చ‌ర్య‌లు తీసుకొని త‌న‌కు న‌ష్ట ప‌రిహారం చెల్లించాల‌ని డిమాండ్ చేస్తూ ఆందోళ‌న చేస్తున్నాడు.

తమిళ స్టార్ హీరో శిలంబరసన్ అలియాస్ శింబు మరోసారి పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. శింబు హీరోగా ‘అన్బనవన్ అసరాదవన్ అడంగాదవన్’ (ఏఏఏ) అనే సినిమా తీసిన నిర్మాత మైకేల్ రాయప్పన్ అతడిపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడానికి శింబునే కారణమని ఆరోపించాడు. అతను షూటింగ్ సందర్భంగా తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడని.. తమకు ఇచ్చిన డేట్లతో పోలిస్తే… 35 శాతం మాత్రమే షూటింగుకి వచ్చాడని.. అందువల్లే ఆ సినిమా అతుకుల బొంతలా తయారైందని.. దీంతో ఫ్లాప్ అయిందని.. అతడి వల్ల తాను రోడ్డు మీదికి వచ్చానని.. శింబు నుంచి తనకు నష్టపరిహారం అందించాలని అతను డిమాండ్ చేశాడు. శింబు మీద ఇప్పటికే నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసిన మైకేల్.. శింబు మీద చర్యలు తీసుకునే వరకు తాను విశ్రమించనని స్ప‌ష్టం చేస్తున్నాడు.

చివ‌రికి డ‌బ్బింగ్‌కు కూడా టైం ఇవ్వ‌లేద‌ని తెలిపాడు. ‘ఏఏఏ’ సినిమాకు సంబంధించి శింబుకు డబ్బింగ్ థియేటర్ వరకు వచ్చి డబ్బింగ్ చెప్పేంత ఖాళీ కూడా లేకపోయింది. తన ఇంటి బాత్రూమ్‌లో కూర్చుని డైలాగులు రికార్డ్ చేసి ఆడియో ఫైల్ పంపాడని మైకేల్ ఆరోపించాడు. దాన్ని మిక్సింగ్ కోసం తీసుకెళ్తే క్వాలిటీ సరిపోలేదని.. అతి కష్టం మీద సౌండ్ క్వాలిటీ ఎన్‌హాన్స్ చేసి మిక్సింగ్ చేశామని మైకేల్ తెలిపాడు. శింబు వల్ల చాలా షూటింగ్ షెడ్యూళ్లు దెబ్బ తిన్నాయని.. హీరోయిన్లు తమన్నా, శ్రియల డేట్లు కూడా సగానికి సగం వృథా అయ్యాయని.. ఆరోపించాడు.

ఇలాంటి ఆరోప‌ణ‌ల‌తో శింబు మీద తమిళ పరిశ్రమ నిషేధం విధించొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉత్కంఠ‌ కొన‌సాగుతోంది. అభిమానులు కూడా శింబు ప‌రిస్థితి ఆందోళ‌న చెందుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -