Friday, May 3, 2024
- Advertisement -

రామ్ సినిమాలో విలన్ గా తమిళ స్టార్ హీరో..!

- Advertisement -

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత యంగ్ హీరో రామ్ మాస్ సినిమాల బాట పట్టాడు. ఆ తర్వాత ఆయన నటించిన రెడ్ మూవీ కూడా మాస్ సినిమానే. ఇప్పుడు కొలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామితో రామ్ ఓ పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హై రేంజ్ లో ఉంటాయట. తాజాగా ఈ సినిమాలో విలన్ గా తమిళ స్టార్ హీరో మాధవన్ ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పటికే లింగుస్వామి మాధవన్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

లింగు స్వామికి తమిళనాట యాక్షన్ సినిమాల డైరెక్టర్ గా పేరుంది. సఖీ, చెలి సినిమాలతో చాక్లెట్ బాయ్ గా పేరు తెచ్చుకున్న మాధవన్ కు లింగు స్వామి డైరెక్షన్ లో చేసిన ‘రన్’ సినిమాతో మాస్ లోనూ ఇమేజ్ వచ్చింది. విశాల్ కు పందెం కోడితో, కార్తీకి ఆవారాతో సూపర్ హిట్లు ఇచ్చాడు లింగు స్వామి.

Also Read: ప్రేమకు వయసుతో పనిలేదు.. అది కేవలం నెంబర్ మాత్రమే: నటి సురేఖ వాణి

ఇప్పుడు రామ్ కూడా ఇస్మార్ట్ శంకర్ తో వచ్చిన మాస్ ఇమేజ్ ని కొనసాగించేందుకు లింగుస్వామి తో జత కట్టినట్లు సమాచారం. ఈ సినిమాలో విలన్ పాత్ర ఎంతో కీలకమైనదట. అందుకే ఒక బలమైన నటున్ని ఆ పాత్రకు తీసుకోవాలని నిర్ణయించుకున్న లింగుస్వామి మాధవన్ ను సంప్రదించారట. ఈ సినిమాలో నటించేందుకు మాధవన్ కూడా ఓకే చెప్పినట్లు కోలీవుడ్ టాక్. మాధవన్ ఇదివరకే నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి మూవీలో విలన్ గా చేశాడు. ఆ సినిమాలో విలన్ గా మాధవన్ మెప్పించాడు. విలన్ గా మాధవన్ నటిస్తున్న రెండో సినిమా ఇది. కరోనా సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత ఈ సినిమా తిరిగి సెట్స్ పైకి వెళ్లనుంది.

Also Read: మ‌ధుమేహం ఉన్న‌వారు మామిడిపండ్ల‌ను తిన‌వ‌చ్చా …?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -