కొరటాల శివ రచయితగా ఇండస్ట్రీకి పరిచియమైన తరువాత కాలంలో దర్శకుడిగా మారాడు. తీసిన మూడు సినిమాలను హిట్ ఘనత కొరటాలకే దక్కుతుంది.మిర్చి,శ్రీమంతుడు,జనతా గ్యారేజ్, ఇలా తీసిన మూడు సినిమాలు హిట్ చేశాడు కొరటాల.ఇప్పుడు మహేష్ బాబు హీరోగా భరత్ అను నేను సిపిమాను తీశాడు కొరటాల.అయితే భరత్ అను నేను కథ కొరటాలది కాదని ఆ మధ్య వార్తులు వచ్చాయి.రూ. కోటి ఇచ్చి వేరే రచయిత దగ్గరి నుంచి కథను కొనుగోలు చేశాడని వాటి సారాంశం. దీనిపై స్పవదించిన కొరటాల శివ …అదంతా రూమర్ అని కొట్టిపడేశారు. కథను ఎలా సిద్ధం చేసిందన్నది ఆయన చెప్పుకొచ్చారు.
కెరీర్ తొలినాళ్లల్లో నా రూమ్మేట్ అయిన శ్రీహరి(దర్శకుడు) అప్పట్లో నాకు ఓ ఐడియా ఇచ్చాడు. హీరో ముఖ్యమంత్రి పాత్ర.. అంటూ అతను ఇచ్చిన ఆలోచన అద్భుతంగా ఉంది. అది నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత ఆ లైన్ను నేను డెవలప్ చేసుకుని కథను సిద్ధం చేశా. ఇది పూర్తిగా నా సొంత కథ. అయినప్పటికీ ఐడియా మాత్రం నా స్నేహితుడిదే. అందుకే టైటిల్ కార్డులో స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ అతని పేరు కూడా వేయిస్తున్నా’ అని కొరటాల స్పష్టం చేశారు. భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
https://www.youtube.com/watch?v=dQjmftyGcng