Saturday, May 18, 2024
- Advertisement -

బ్రేకింగ్ : ఐదుగురు హీరోలతో కృష్ణ వంశీ సినిమా – రుద్రాక్ష

- Advertisement -

ఖడ్గం, సింధూరం, చందమామ, అంతః పురం ఇలాంటి సినిమాలు తీయాలి అంటే అది కృష్ణ వంశీ కే చెందింది. ప్రస్తుతం గోవిందుడు అందరి వాడెలే సినిమాతో మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చేసిన కృష్ణ వంశీ ఇప్పుడు దిల్ రాజు తో తీయబోతున్న కొత్త సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.

కృష్ణ వంశీ ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త హర్రర్ కథాంశం తో తన తదుపరి సినిమా స్క్రిప్ట్ ని సిద్దం చేసాడట. అది దిల్ రాజు కి విపరీతంగా నచ్చడంతో ఆయన స్వయంగా నిర్మించడానికి ముందుకు వచ్చాడు. “రుద్రాక్ష” అనే టైటిల్ ని అనుకుంటున్నారు అని మనం ముందే తెలిపిన స్టొరీ ఇది. ఈ సినిమా గురించి అందుతున్న సమాచారం మేరకు ఇందులో ఏకంగా ఐదుగురు హీరోలు ఉంటారు అని సమాచారం.

పెద్ద హీరోలా లేక చిన్న హీరోలా అనేది తెలియాల్సి ఉంది. ఐదుగురు హీరోలకీ సమాన ప్రాధాన్యత ఉన్నందున ఐదుగురు మీడియం బడ్జెట్ హీరోలని తీసుకోవాలని దిల్ రాజు ఐడియా. ఈ మధ్యనే ఫైనల్ నేరేషన్ కృష్ణ వంశీ దిల్ రాజు కి వినిపించడం ఇక దిల్ రాజు అంతా ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -