Friday, May 3, 2024
- Advertisement -

ఫ్లాఫుల మధ్య కూడా కృష్ణవంశీ సూపర్ ఛాన్స్ కొట్టాడు!

- Advertisement -

ప్రస్తుతం దర్శకుడు కృష్ణవంశీ పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. ఆయన చాలా కాలంగా వరస ప్లాఫుల మధ్య ఉన్నాడు.

అన్ని ఫ్లాఫుల మధ్య మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ అవకాశం ఇచ్చాడు. అయినప్పటికీ ఆ సినిమాతో సత్తా చాటలేకపోయాడు కృష్ణవంశీ ‘గోవిందుడు అందరివాడు’ సినిమా అంత గొప్పగా నిలవలేకపోయింది. అలనాటి ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమాను రీమేక్ చేసి… కృష్ణవంశీ నిరాశ పరిచాడు. మరి ఒక పెద్ద హీరోతో సినిమా తో ప్లాఫ్ సినిమా తీసినా.. మళ్లీ అవకాశం లభించడం అంటే మాటలు కాదు!

అయితే ఇప్పుడు కృష్ణవంశీకి ఒక సూపర్ ఛాన్స్ దక్కింది. ఏకంగా ఇద్దరు ప్రముఖులు ఈ దర్శకుడితో సినిమా చేయడానికి ముందుకొచ్చారు. నిర్మాత దిల్ రాజు, నటుడు ప్రకాష్ రాజ్ లు కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక  సినిమాను నిర్మించనున్నారని తెలుస్తోంది. ఇది ఒక హారర్ కమ్ థ్రిల్లర్ సినిమా అని తెలుస్తోంది.

కొంతకాలం గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ ఈ సినిమాతో తిరిగి సత్తా చాటే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాకు ‘రుద్రాక్ష’ అని పేరు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఒక ప్రముఖ హీరోయిన్ ఇందులో నటిస్తుందని.. తనే సినిమాను లీడ్ చేస్తుందని సమాచారం. మరి వరస ప్లాఫ్ ల మధ్య కృష్ణవంశీకి ఇద్దరు ప్రముఖుల నిర్మాణంలో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆయన దీంతో ఏ మేరకు సత్తా చాటతాడో చూడాలి! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -