Monday, April 29, 2024
- Advertisement -

విజయ్ కి ” లైగర్ ” షాకులు.. ఏకంగా ఈడీ విచారణ!

- Advertisement -

రౌడీ హీరోగా యూత్ లో ఫుల్ క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండకు పూరీ డైరెక్షన్ లో వచ్చిన లైగర్ మూవీ భారీ షాక్ ఇచ్చింది. మాస్ హీరోయిజాన్ని ఓ రేంజ్ లో చూపించే పూరీ దర్శకత్వంలో మూవీ కావడం, అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో.. పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవచ్చని విజయ్ భావించాడు. అందుకు తగ్గట్టుగానే మూవీ విడుదలకు ముందు జోరు చూపించాడు. తీరా మూవీ విడుదల అయిన తరువాత చిత్రయూనిట్ ఊహించని రీతిలో డిజాస్టర్ అయింది. దాంతో విజయ్ ఓవర్ కాన్ఫిడెంట్స్ పై వచ్చిన ట్రోల్స్ అన్నీ ఇన్ని కావు. లైగర్ ఇచ్చిన ఎఫెక్ట్ తో విజయ్ కొన్నాళ్లు సైలెంట్ అయ్యాడు. .

ఇక మూవీ భారీ నష్టాలు చవి చూడడంతో చిత్రా నిర్మాత ఛార్మి, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో పూరీ ఆస్తులన్నీ అమ్ముకున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. ఆ మద్య ఈడీ విచారణకు కూడా పూరీ, ఛార్మి హాజరు అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా విజయ్ కూడా ఈడీ విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. లైగర్ మూవీకి గాను విజయ్ తీసుకున్న రిమ్యూనరేషన్, ఇతరత్రా పెట్టుబడులకు సంబంధించి ఈడీ అధికారులు విజయ్ ని విచారించినట్లు తెలుస్తోంది. మొత్తానికి లైగర్ మూవీ ఇస్తున్న షాకులు ఇప్పటికీ కూడా విజయ్ ని వెంటాడుతూనే ఉన్నాయి. మరి ఆ మూవీ ఇచ్చిన ఎఫెక్ట్ నుంచి కోలుకొని విజయ్ ఎప్పుడు కామ్ బ్యాక్ ఇస్తాడో చూడాలి. ప్రస్తుతం ఈ రౌడీ హీరో శివ నిర్వాణ దర్శకత్వంలో ” ఖుషీ ” అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

చరణ్ బుచ్చిబాబు మూవీ స్టోరీ ఇదేనా ?

ఆదిపురుష్ కష్టాలు.. వచ్చే ఏడాది కూడా డౌటే !

లోకేశ్ కోసం తెలుగు హీరోలు వెయిటింగ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -