Wednesday, May 15, 2024
- Advertisement -

చిరు బర్త్ డే పార్టీకి ప్రభాస్, రాజమౌళి, మహేశ్ లు ఎందుకు రాలేదంటే….

- Advertisement -

మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా హోటల్ పార్క్ హయత్ లో ఏర్పాటు చేసిన భారీ పార్టీకి అనేక మంది సినీ రంగ ప్రముఖులు హాజరు అయ్యారు.

ఉత్తరాది నుంచి కూడా ప్రముఖ హీరోలు తరలి వచ్చిన ఈ పార్టీకి కొంతమంది దక్షిణాది తారలు మాత్రం మిస్ అయ్యారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహేశ్, ప్రభాస్ లాంటి హీరోలను.. రాజమౌళి లాంటి దర్శకుడిని.

టాలీవుడ్ లో బాగా ఫేమ్ పొందిన వీళ్లు ఈ పార్టీకి హాజరు కాలేదు. మరి ఇది కచ్చితంగా చాలా ఆసక్తికరమైన అంశం. వీరు వచ్చి ఉంటే పార్టీకి మరింత కళ వచ్చేది. మరి వీళ్లు రాకపోవడానికి మాత్రం బలమైన రీజన్లు ఉన్నాయని తెలుస్తోంది. వీరిలో ప్రభాస్ , మహేశ్ లు విదేశాల్లో ఉన్నారు. పార్టీ సమయానికి వారు ఫారిన్ లో ఉన్నారు. బాహుబలి కోసం తీవ్రంగా శ్రమించిన ప్రభాస్ యూరప్ టూర్లో ఉన్నాడు. తన సన్నిహితులతో అతడు పార్టీ మూడ్ లో ఉన్నాడు.

ఇక శ్రీమంతుడు సక్సెస్ తర్వాత మహేశ్ ఫ్యామిలీతో థాయ్ వెళ్లాడు. దీంతో ఈ ఇద్దరూ ఈ పార్టీ కి రాలేకపోయినట్టుగా తెలుస్తోంది. ఇక రాజమౌళి ఏమో ఇదే రోజున చెన్నైలో ఉండి పోయాడు. ఓవరాల్ గా ఈ పరిస్థితి అందరికీ అర్థం అవుతోంది. ఈ రీజన్లతోనే వారు ఈ పార్టీని మిస్ అయినట్టుగా అర్థం చేసుకోవాల్సి వస్తోంది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -