- Advertisement -
సావిత్రి జీవిత కథను మహనటిగా సినిమాగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.గత వారం రీలిజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. సినిమా కలెక్షన్లు కూడా అధేవిధాంగా ఉన్నాయి. ఈ నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలి 5 రోజుల్లో భారీ వసూళ్లను రాబట్టింది. తొలి 5 రోజుల్లో ఈ సినిమా ఒక్క నైజామ్ లోనే 3.5 కోట్లను వసూలు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో 7.82 కోట్ల షేర్ ను వసూలు చేసింది. అమెరికాలో 6.6 కోట్ల షేర్ ను రాబట్టింది.అమెరికాలో మహనటి సినిమా ఓవర్ఆల్గా 6వ స్థానంలో నిలిచింది.ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ 5 రోజుల్లో ఈ సినిమా 16.2 కోట్ల షేర్ ను వసూలు చేసింది.సావిత్రి పాత్రను హీరోయిన్ కీర్తి సురేష్ చేసిన సంగతి తెలిసిందే.నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.