Saturday, May 4, 2024
- Advertisement -

మ‌హ‌న‌టిని బాలీవుడ్ పిలుస్తోంది..!

- Advertisement -

కీర్తి సురేష్ ఒక్క సినిమాతో తెలుగు ,త‌మిళ భాష‌ల‌లో స్టార్ హీరోయిన్‌గా మారింది. అల‌నాటి న‌టి సావిత్రి బ‌యోపిక్‌లో న‌టించిన కీర్తి సురేష్‌కు ఈ సినిమా చాలామంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా త‌రువాత తెలుగులో సినిమాలు చేయ‌లేదు కాని , త‌మిళంలో స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది. విశాల్‌, విజ‌య్‌, విక్ర‌మ్‌, వంటి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసింది కీర్తి సురేష్‌. ఏర్ మురుగదాస్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీకాంత్ న‌టిస్తున్న సినిమాలో కూడా హీరోయిన్‌గా కీర్తిని తీసుకున్నార‌ని స‌మాచారం.

తాజాగా కీర్తి సురేష్‌కు బాలీవుడ్ నుంచి పిలుపు వ‌చ్చింద‌ని తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోని కపూర్‌, అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో కీర్తి బాలీవుడ్ ఎంట్రీ దాదాపుగా కన్ఫామ్‌ అయ్యింది. ఈ సినిమాలో హీరో ఎవ‌రు అనేది తెలియాల్సి ఉంది. సౌత్‌లో మ‌హ‌న‌టిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ , బాలీవుడ్‌లో ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో చూడాలి. కీర్తి సురేష్ ప్ర‌స్తుతం తెలుగులో ఓ సినిమా చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -